TEJA NEWS

శ్రీశ్రీశ్రీ భూలోకమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీపీ పైలా….

పరవాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూలోకమాంబ అమ్మవారి పండుగ మహోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూలోకమాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందం గా ఉందని, అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత, గ్రామ ప్రజలు పై ఎల్లప్పుడూ ఉండాలని, సుభిక్షం గా ఆనందంగా ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్దించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, మాజీ ఆర్ సి ఎస్ చైర్మన్ చల్ల కనకరావు, పైల హరీష్, వర్రీ హరి, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS