TEJA NEWS

బీచుపల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ కేశవ్

జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో వారితో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికీ తీర్థప్రసాదలు స్వీకరించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా గద్వాల నడిగడ్డ ప్రజలకు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ కుమార్ నాగులు యాదవ్ మధు కమ్మరిరాము వడ్డేకృష్ణ మరియు మద్రాస్ పేట యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS