TEJA NEWS

ఒక్కడినీ గెలవనియ్య.. ఆ మంత్రిని పాతర పెట్టకపోతే నా పేరు తీన్మార్‌ మల్లన్నే కాదు

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Teenmar Mallanna | హైదరాబాద్‌, ఆగస్టు 26 : ‘వాళ్లంతా కలిసి మూకుమ్మడిగా నన్ను ఓడించేందుకు కుట్ర చేశారు.

మీరు రాసిపెట్టుకోండి.. మిత్తి, అసలు, చక్రవడ్డీ కలిపి వచ్చే ఎన్నికల్లో ఒక్కడు కూడా గెలవకుండా పాతర పెట్టకపోతే నా పేరు తీన్మార్‌ మల్లన్నే కాదు’ ఇవీ ఆదివారం కాజీపేటలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆయన ఈ వ్యాఖ్యలు ఏ మంత్రిని ఉద్దేశించి చేశారనే చర్చ జోరుగా జరుగుతున్నది.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో విదేశాల్లో ఉన్న ఒక మంత్రి ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌(కలెక్టర్‌)కు ఫోన్‌ చేసి తాను ఓడిపోయే అవకాశం ఏమైనా ఉన్నదా? అని ఆరా తీశారని మల్లన్న చెప్పారు. తనను ఓడించేందుకు కుట్ర చేసిన వాళ్లలో ఒక్కడిని కూడా వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వనని, అలా చేయకపోతే తన పేరు తీన్మార్‌ మల్లన్నే కాదని శపథం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రి కోమటిరెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లడంపై అప్పట్లోనే రకరకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మల్లన్న వ్యాఖ్యలు కోమటిరెడ్డిని ఉద్దేశించినవనే ప్రచారం జోరందుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తా.. రాసిపెట్టుకోరి ప్రభుత్వాన్ని మల్లన్న హెచ్చరించడం గమనార్హం.

Print Friendly, PDF & Email

TEJA NEWS