TEJA NEWS

పిట్టా శాంతి కి జాతీయ ప్రతిభా పురస్కారం

నర్సాపురం: స్ధానిక జి వి ఆర్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీ వై యన్ కాలేజి ప్రిన్సిపాల్ డా పిట్టా శాంతికి 2024 సంవత్సరానికి గాను జాతీయ ప్రతిభా పురస్కారం ఇస్తున్నట్లు సదరన్ ప్రవేటు లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ కె యస్ లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలియజేసారు.ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిభావంతులైన ఆచార్యులకు,అధ్యాపకులకు,ఉపాధ్యాయులకు అందజేసే ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరం జి వి ఆర్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీ వై యన్ కాలేజి ప్రిన్సిపాల్ కు అందజేస్తున్నట్లు తెలియజేసారు.25/08/2024 న గుంటూరు లోని ఏ సి కళాశాలలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రధానం చేయటం జరుగుతుందని నిర్వాహక కమిటీ తెలియజేసింది.బి యిడి కాలేజి ప్రిన్సిపాల్ డా పిట్టా శాంతికి ఈ అవార్డు ప్రకటించటం పట్ల కళాశాల సెక్రెటరీ& కరస్పాడెంట్ డా చినిమిల్లి సత్యనారాయణ,గవర్నంగ్ బాడీ మెంబర్స్ ,పాలకవర్గ సభ్యులు ,వై యన్ కాలేజి ప్రిన్రిపాల్ డా కనకరావు,కళాశాల డీన్ డా గంధం రామకృష్ణ,పి జి కళాశాల డైరెక్టర్ డా చింతారావు,అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్ధినీ విద్యార్ధులు శుభాకాంక్షలు అందజేసారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS