TEJA NEWS

కొత్త రూల్.. గణేష్ మండపం పెట్టాలంటే ఈ డ్యాకుమెంట్లు తప్పనిసరి..!

హైదరాబాద్ లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు https://www.tspolice.gov.in సైట్లో అప్లె చేసుకోవాలని సూచించారు. 2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని, రాత్రి 10 గం. నుంచి ఉ.6 వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం 8712665785కు కాల్ చేయాలన్నారు.

గణేశుడిని నిలబెట్టేవారు పాటించాల్సిన నిబంధనలు

పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి.
DJలకు అనుమతి లేదు.
రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి.
సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్, రాచకొండ,సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS