TEJA NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

సాక్షిత సిద్దిపేట జిల్లా

సిద్దిపేట జిల్లా ,వర్గల్ మండలం,నెంటూరు గ్రామానికి చెందిన గజ్వేల్ ఎన్ ఎమ్ ఆర్ సభ్యులు కరుణాకర్ తండ్రి హాట్ స్ట్రోక్ తో అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎంఆర్ అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తన వంతు సాయంగా మృతుని అంత్యక్రియలకు పదివేల రూపాయల ఆర్థిక సాయం మన్నెశ్రీనివాస్ చేతుల మీదుగా అందించడం జరిగింది. అనంతరం మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ గజ్వేల్ ఎన్ ఎమ్ ఆర్ అధ్యకుడు నీలం మధు తను అందుబాటులో లేకున్నా ఫోన్ ద్వారా మాట్లాడి తన వంతు సాయం మృతుని కుటుంబానికి 10000 రూపాయలు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS