TEJA NEWS

ఉప్పల్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి ..

*సాక్షిత : * ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ డివిజన్లో మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి * హాజరు కావడం జరిగింది..

అనంతరం నిర్వహించిన ఫలారం బండి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించి వారు రాగిడి లక్ష్మారెడ్డి ని ఘనంగా శాలువాతో సత్కరించడం జరిగింది..

అరటికాయల భాస్కర్ , వేముల సంతోష్ , అన్య బాలకృష్ణ , వారి మిత్ర బృందం నిర్వహించిన బోనాల సభలో పాల్గొన్న *మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి *

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..


TEJA NEWS