TEJA NEWS

ఘనంగా ఓడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు
•పేద ప్రజల కోసం సాగు, త్రాగు నీరు సరఫరా కోసం అయన చేసిన సేవలు మరువలేనివి -మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

కమలాపూర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ ఒడితెల రాజేశ్వరరావు 93వ జయంతి సందర్భంగా కమలాపూర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ రాజేశ్వర్ రావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా చరణ్ పటేల్ మాట్లాడుతూ ఒడితెల రాజేశ్వర్ రావు హుజూరాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడని గల్లీ నుండి ఢిల్లీ దాక ఆయన సేవలు ఉన్నాయని ఆయన అన్నారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ, గా, ఎంపీ గా రాజ్య సభ సభ్యులు గా ఎదిగిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని అన్నారు. హుజూరాబాద్ పట్టణ కేంద్రం లో ఒడితెల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని చరణ్ పటేల్ తెలిపారు . ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దూడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS