TEJA NEWS

శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి

శంకర్‌పల్లి మండల ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారినిగా రమాదేవి ( ఎడిఏ అగ్రికల్చర్) పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన స్పెషల్ ఆఫీసర్ కు ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పుష్పగుచ్చమిచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ గీతారెడ్డి, ఎస్పిటి, ఏపిఎం, ఏపీవో పాల్గొన్నారు.


TEJA NEWS