TEJA NEWS

ఉమ్మడి ఖమ్మం

స్థానిక 46వ డివిజన్ లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎస్.బి. ఐ.టి., ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ ప్రారంభించారు. అదేవిధంగా మండపం లో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు అందరి విఘ్నాలు తొలగించి కరుణా కటాక్షాలు కురిపిం చాలని, ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని వినాయకుని కోరినట్లు తెలిపారు.ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న కమిటీ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు తోట రామారావు ,కనకం భద్రయ్య, కమిటీ సభ్యులు అంజీ, కిషోర్ , అరవింద్, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS