TEJA NEWS

టీడీపీ సీనియర్ నాయకులు మృతి.

నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం,

ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొప్పులపూడి రమేష్ బాబు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు ఉదయం కిలేశపురంలోని రమేష్ బాబు నివాసానికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. రమేష్ బాబు మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు పాల్గొన్నారు. ఎన్డీఏ మహాకూటమి నేతలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS