TEJA NEWS

సేవాలాల్ సేన కమిటీ ఉమ్మడి వరంగల్ ,జనగాం జిల్లా లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యుల ఆదేశాల మేరకు వివిధ జిల్లాల నుండి రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి సభావాత్ రామచంద్రనాయక్ కి సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షునిగా కేతావత్ సుధాకర్ నాయక్ ని జిల్లా అధ్యక్షునిగా, మాలోత్ సునీత నాయక్ ని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా, నియమిస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది.

గత 15 సంవత్సరాల నుండి వివిధ పార్టీలలో చురుకైన పాత్ర పోషిస్తూ బంజారా జాతి కోసం అహర్నిశలు పనిచేస్తూ జాతిని ఐక్యం చేస్తూ అటు ఉద్యమంలో ఇటు జాతి కోసం సేవలందించినటువంటి రామచంద్రనాయక్ ని గుర్తించి రాష్ట్ర సేవాలాల్ సేన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను ఇస్తూ రాష్ట్ర కమిటీతోపాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీతో పాటు జిల్లాల్లో అన్ని మండల ,మున్సిపాలిటీ ,వివిధ గ్రామాలల బంజారా సేవాలాల్ సేన ,కమిటీలు ఏర్పాటు చేస్తూ జాతిని ఏకతాటిపై చైతన్యం చేస్తారని తన వంతు కృషి చేస్తున్న చేస్తానని రామచంద్రనాయక్ తెలిపారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవల సేన అధ్యక్షులు రాంబాబు నాయక్ , త్రిసభ్య కమిటీ సభ్యులు, చిన్న బాబు నాయక్, ప్రేమ్చంద్ నాయక్, సేవలాల్ సేన సంస్కృతిక జాతీయ అధ్యక్షులు బంజారా ఆది కవి డాక్టర్ ఎస్పీ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత నాయక్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు కె సుధాకర్ నాయక్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గోపాల్ నాయక్, పాండు నాయక్ ,వినోద్ నాయక్ తుకారాం ,నాయక్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు,

Print Friendly, PDF & Email

TEJA NEWS