TEJA NEWS

ప్రజల సంక్షేమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి: శంభీపూర్ క్రిష్ణ…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు, సంఘ సభ్యులు కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాలలో తరచూ డ్రైనేజ్ ఓవర్ ఫ్లోతో దుర్వాసన, దోమల వృద్ధితో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని సమస్యలకు గల కారణాలు తెలుసుకొని శాశ్వత పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు…


TEJA NEWS