TEJA NEWS

రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని.
లలిత ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య.

శంకర్ పల్లి : పేదలు,మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య సూచించారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత ఆసుపత్రిని ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,,,ఆస్పత్రి యాజమాన్యం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో సేవలందించాలని ఎమ్మెల్యే తెలియజేశారు.ఆసుపత్రికి వచ్చే రోగులను ముందుగా ప్రేమగా పలకరించి,అనంతరం వారి సమస్యలను తెలుసుకొని సేవలందించాలని తెలియజేశారు.వైద్యో నారాయణి హరి అంటారని, కనిపించే డాక్టర్లే దేవుళ్ళతో సమానమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS