కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు 400 ఇస్తాం

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు 400 ఇస్తాం

TEJA NEWS

ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

★ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పనితో పాటు 400 రూపాయలు ఇస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూక్ నగర్ మండల పరిధిలోని చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవునిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మమేకమై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పనులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమల్లోకి తెచ్చింది సోనియాగాంధీయేనని, పేదల ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తెచ్చారని చెప్పారు.

వంద రోజుల పనిని 42 రోజులకు తగ్గించారని, కూలీ కూడా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS