TEJA NEWS

చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
ప్రధానికి ఎంపీ కొండా విజ్ఞప్తి

శంకరపల్లి : చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండని స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఎంపీ కొండా మాట్లాడుతూ మీ నియోజకవర్గానికి తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. మల్కాజిగిరి, మెదక్ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొన్నారు.


TEJA NEWS