సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్, డా,, మౌటం కుమారస్వామి ఎన్నిక
…..
కమలాపూర్ మండల కేంద్రం లో జరిగిన మిత్రమండలి పరస్పర పరపతి సహకార సంఘ సమావేశం లో పార్టీలకు అతీతంగా ఆ సంఘ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా గుండారపు చరణ్ పటేల్ ప్రధాన కార్యదర్శిగా డా,, మౌటం కుమారస్వామి ఉపాధ్యక్షునిగా బొల్లం రాజిరెడ్డి కార్యదర్శి గా దూడ శ్రీకాంత్ కోశాధికారి గా విద్యా సాగర్ ఎన్నికైన్నారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడు చరణ్ పటేల్ మాట్లాడుతూ ఒక్కరి కోసం అందరు – అందరి కోసం ఒక్కరు అనే సహకార సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగిందని సభ్యుల కష్ట నష్టాలో ఒకరికి ఒకరు తోడు ఉండాలని పేర్కొన్నారు. మాజి సర్పంచ్ మాట్ల రవీందర్ మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామజికంగా ఆర్థికంగా సహకారం ఆందిపుచ్చుకోవటమే ఈ సంఘ ఏర్పాటు ఉదేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సభ్యులు మాట్ల రవీందర్ దర్ముల సదానందం వొళ్ళాల శ్రీనివాస్ గొట్టె రవి నారాయణ రెడ్డి కొండపాక మనీష్ పాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా
Related Posts
జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు
TEJA NEWS జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించిన – ప్రిన్సిపల్ పిడి రాజు కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు…
శంకర్పల్లి నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన స్వాములు
TEJA NEWS శంకర్పల్లి నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన స్వాములు శంకర్పల్లి: శంకర్పల్లి నుండి శబరిమల వరకు పాదయాత్రను పట్టణానికి చెందినఅయ్యప్ప స్వాములు ప్రారంభించారు. ఈ సందర్భంగాపట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోత్సవాల నిర్వహించి స్వాములకు…