TEJA NEWS

రైతు బజార్లను తనిఖీ చేసిన జిల్లా సంయుక్త కలెక్టరు చిన్నరాముడు

రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టరు యస్. చిన్నరాముడు రాజమహేంద్రవరం లోని మార్కెట్ యార్డ్, క్వారీ సెంటర్ మరియు వై. జంక్షన్ రైతు బజార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయల నాణ్యతను పరిశీలించారు. రైతు బజార్లలో ఉన్న రికార్డులను కూడా తనిఖీ చేసిన ఆయన, ఎస్టేట్ అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అదేవిధంగా, పౌర సరఫరాల శాఖ ద్వారా ఏర్పాటు చేసిన బియ్యం మరియు కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏ.డి. మార్కేటింగ్ యం. సునీల్ వినయ్, జిల్లా పౌర సరఫరాల అధికారి పి. ఉదయ భాస్కర్, రైతు బజార్ ఎస్టేట్ అధికారులు ఇ. భాస్కర్, కె. శ్రీనివాస్, మరియు రోజియా పాల్గొన్నారు.


TEJA NEWS