ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు…
పాయకరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగవరం రోడ్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం ను పరిశీలించారు. సమస్యలు ఉంటే చెప్పాలంటూ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.ప్రతీ విద్యార్థి ఆమెను కలసి కరాచలనం చేయడానికి ఆసక్తి చుపించారు. ఆమె విద్యార్థుల అందరితో కరాచలనం చేశారు. అలాగే ఉపాధ్యాయులతోనూ చర్చించారు.పాటశాల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాయకరావు పేట బాలికల పాఠశాల వద్ద గంజాయి సేవిస్తూ యువకులు తిరుగుతున్నట్లు ఉపాధ్యాయులు ద్వారా సమాచారం అందుకున్న మా పోలీస్ సిబ్బంది పాఠశాల ఆవరణలో సి.సి.కెమెరా లు కూడా అమర్చడం జరిగిందన్నారు. అంతే కాకుండా ఈ పాఠశాల ,కళాశాలల్లో విద్యార్థులు ల్యాబ్ లు ,బిల్డింగ్ లు లేకపోవడం తో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారన్నారు.
గంజాయి రహిత రాష్ట్రం ను రానున్న రోజుల్లో చూడబోతున్నామని హామీ ఇచ్చారు.విద్యార్థుల కు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సబంధించిన అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
TEJA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
TEJA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు…