ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు…
పాయకరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగవరం రోడ్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం ను పరిశీలించారు. సమస్యలు ఉంటే చెప్పాలంటూ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.ప్రతీ విద్యార్థి ఆమెను కలసి కరాచలనం చేయడానికి ఆసక్తి చుపించారు. ఆమె విద్యార్థుల అందరితో కరాచలనం చేశారు. అలాగే ఉపాధ్యాయులతోనూ చర్చించారు.పాటశాల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాయకరావు పేట బాలికల పాఠశాల వద్ద గంజాయి సేవిస్తూ యువకులు తిరుగుతున్నట్లు ఉపాధ్యాయులు ద్వారా సమాచారం అందుకున్న మా పోలీస్ సిబ్బంది పాఠశాల ఆవరణలో సి.సి.కెమెరా లు కూడా అమర్చడం జరిగిందన్నారు. అంతే కాకుండా ఈ పాఠశాల ,కళాశాలల్లో విద్యార్థులు ల్యాబ్ లు ,బిల్డింగ్ లు లేకపోవడం తో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారన్నారు.
గంజాయి రహిత రాష్ట్రం ను రానున్న రోజుల్లో చూడబోతున్నామని హామీ ఇచ్చారు.విద్యార్థుల కు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సబంధించిన అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..
Related Posts
జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన
TEJA NEWS ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన…. ఇసుక ట్రాక్టర్లు రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకొని రెవెన్యూ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణలు…. ఇసుక కొరత వలన తామంతా డ్రైవర్లు , తాపీ…
విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్
TEJA NEWS విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్ విశాఖపట్నం: తనపై సాక్షి పత్రిక రాసిన తప్పుడు కథనానికి సంబంధించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు…