TEJA NEWS

వరద బాధితులకు చాపలు , బ్లాంకెట్స్ పంపిణీ చేసిన జమాఅతె ఇస్లామి హింద్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదలు వచ్చి సర్వం కోల్పోయి నిరాశరులైన దంసలాపురం కాలనీ వరద బాధితులకు జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో వరద ముంపు బాధిత కుటుంబాలకు ఇండ్ల దగ్గరికి వెళ్లి చాపలు , బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. జమాఅతె ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా నిరాశరులైన వరద బాధితులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు జమాత్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యాక్రమములో వన్ టౌన్, టూ టౌన్, అధ్యక్షులు అబ్దుల్ మలిక్, అబ్రార్ అలీ సభ్యులు నిజాముద్దీన్, గౌస్, యసుఫ్ షరీఫ్, ఇంద్ర నగర్ మహిళా అధ్యక్షురాలు హుస్సేన్ బి, జహీరా, ఆరిఫా ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS