TEJA NEWS

పంచలోహ విగ్రహాలు సమర్పణ

రాజమహేంద్రవరం, స్థానిక క్వారీ ఏరియా ఎమ్మెస్సార్ నగర్ లో ప్రసిద్ధి గాంచిన శ్రీ కళ్యాణి దేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచలోహ విగ్రహాలను సమర్పణచే కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వర్గీయ మేడపాటి సీతారామరెడ్డి జ్ఞాపకార్ధం ఆయన భార్య సుశీలాదేవి, కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి, కోడలు షర్మిల రెడ్డి, మనుమరాలుహంసినీ శ్రీయారెడ్డి, మనుమడు అభినవ్ సిద్ధార్ధ్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. షర్మిల రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి దంపతులు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చ, సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.


TEJA NEWS