సబ్స్టేషన్ స్థల పరిశీలన
* * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంబిపూర్, మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామంలో 3 -ఫేస్ కరెంటు ఒడిదుడుకులు మరియు కరెంటు రాకపోవడంతో గత నెల కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి కె .వి ఆర్ ,స్ప్రింగ్ వుడ్స్ , ప్రణీత్ నతురల్ బౌంటీ మరియు ల్యక్ రిడ్జ్ కాలనీ వాసులు విన్నపించగా వారు వెంటనే స్పందించి S.E ,D.E మరియు A.E తో మాట్లాడి సబ్ స్టేషన్ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా శంబిపూర్, మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామంలో సబ్స్టేషన్ ఏర్పాటు స్థలాన్ని పై అధికారులతో పరిశీలించారు .ఈ కార్యక్రమంలో NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, ట్రాన్స్కో SE- రంజీ, ADE- అరుణ్, SE రవికుమార్, DE -జీడిమెట్ల విష్ణువర్ధన్ రెడ్డి, AE బాచుపల్లి- శాంత కుమార్, DE కూకట్ పల్లి -చక్రవర్తి , ADE మియాపూర్-హరికృష్ణ, AE భౌరంపేట్- సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
సబ్స్టేషన్ స్థల పరిశీలన
Related Posts
నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
TEJA NEWS నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు – బీసిఐ క్షేత్ర సహాయకులు – కంచం అనిల్ కమలాపూర్ గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది లింగాకార్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని…
అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు
TEJA NEWS అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు కరీంనగర్ – చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు అదనంగా బస్సులు నడిపించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్…