నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ను మంత్రి సందర్శించారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడారు. పీఎంలంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతోందని, రక్షణగోడ నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో నిర్మాణపనులు ప్రారంభమవుతాయన్న మంత్రి, దేశీయ స్థాయిలో ఇది మొదటి ప్రయోగాత్మక ప్రాజెక్టు అని చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు
Related Posts
ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు
TEJA NEWS ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు పరవాడ మండల కేంద్రం పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పరవాడ సిఐ ఆర్ మల్లికార్జునరావు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల గురించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా…
మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసన
TEJA NEWS మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసనఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ అనకాపల్లి జిల్లా పరవాడ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీ విధానం ద్వారా తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నామని వాపోయారు.…