TEJA NEWS

జగిత్యాల జిల్లా కేంద్రంలో లైబ్రరీని సందర్శించి,పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగ యువత తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .

ఎమ్మెల్యే మాట్లాడుతూ
జగిత్యాల నియోజకవర్గం,జిల్లా దూర ప్రాంతాల నుండి అనేక మంది లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తాను అన్నారు ఎమ్మెల్యే.

లైబ్రరీలో కరెంటు మరియు స్టేషనరీ సమస్య తన దృష్టికి వచ్చిందని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

1 కోటి రూపాయలతో నిర్మిస్తున్న లైబ్రరీ భవనాన్ని త్వరిత గతిన పూర్తి చేసి,జిల్లా గ్రంథాలయాన్ని సొంత భవనం లోకి మార్చే విధంగా చొరవ తీసుకుంటా

గ్రామ పంచాయతీలలో లైబ్రరీ సెస్సు వసూలు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి,లైబ్రరీ ల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో బిసి స్టడీ సెంటర్ ఏర్పాటు తో నిరుద్యోగ యువత కు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విధంగా స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఫోన్ ద్వారా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఫోన్ ద్వారా తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శకుంతల,మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్,కౌన్సిలర్ లు కూసరి అనిల్,ముస్కు నారాయణ రెడ్డి,యూత్ నాయకులు కత్రోజ్ గిరి,యం ఏ అరిఫ్, చిట్ల మనోహర్,జంగిలీ శశి,రామ కృష్ణ రెడ్డి,రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS