వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

TEJA NEWS

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి

10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ

57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి

తాడేపల్లి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్‌-2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS