అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Spread the love

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముందస్తుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మైలవరంలోని శాసనసభ్యుని కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నూతన ఆంగ్ల సంవత్సరం మన అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మీకూ మీ కుటుంబ సభ్యులకు “నూతన సంవత్సర” శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్‌ కోసం సీఎం జగనన్న ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగనన్న నూరుశాతం సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పథకాలు ఆపలేదన్నారు. తమది పేదల ప్రభుత్వం అన్నారు.

పేదలకు నూతన ఏడాది కానుకగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా సీఎం జగనన్న సామాజిక పింఛన్లను జనవరి 2024 నుంచి రూ.3,000లకు పెంచినట్లు పేర్కొన్నారు. పేదల కుటుంబాలు సంతోషంగా ఉండాలని పారదర్శక పాలనందిస్తుంటే స్వార్థపరులు, దుర్మార్గులు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. జగనన్న పాలన వల్ల సంక్షేమ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page