TEJA NEWS

పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా గాజువాక నియోజకవర్గంలో మహా సంప్రోక్షణ దీక్ష


ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా 87వ వార్డు వడ్లపూడి, వెంకటేశ్వర స్వామి ఆలయంలొ జనసేన రాష్ట్ర పి ఎ సి సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త కోన తాతారావు, పార్టి నేతలు సంప్రోక్షణ దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు

పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా గాజువాక లో మహా సంప్రోక్షణ దీక్ష చేపడుతున్నామని అన్నారు వందల ఏళ్ళ నుంచి స్వామివారికి లడ్డు రూపంలో అందించే మహా ప్రసాదం కోట్లాది భక్తులు భక్తి భావంతో హృదయానికి అద్దుకొని స్వీకరిస్తారన్నారు. మన పూర్వీకులు లడ్డు ద్వారా మన సంస్కృతి ధర్మంతో అందించటం జరిగిందన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. తిరుమల దేవస్థానం విషయంలో కేవలం అహంకారంతో చేసిన పనులను, పాలకులు స్వార్థాల కోసం ఆలయాలను ఉపయోగించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు,తిప్పలరమణారెడ్డి,ప్రియదర్శిని కళావతి,శాలిని,దాసరి వెంకట జయలక్ష్మి,రామారావు, జ్యోతి రెడ్డి, మురళీదేవి,చైతన్య,కాతా శ్రీను తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS