TEJA NEWS

గండివానిపాలెం లో ఘనంగా శ్రీ దుర్గాదేవి రాట మహోత్సవం
విగ్రహందాత – బలిరెడ్డి అప్పారావు కుమారుడు బలిరెడ్డిబాలరాజు & శ్రీదేవి దంపతులు

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గండివానిపాలెం గ్రామప్రజలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రులు మహోత్సవ సందర్భంగా దుర్గాదేవి రాట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ దుర్గ మాంబ యూత్ కుర్రవాళ్ళు మరియు గ్రామప్రజలు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అభిలాషించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దుర్గాదేవి మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు యూత్ సభ్యులు ప్రయత్నాల చేస్తామని అన్నాను.

గత కొన్నేళ్లుగా అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, వచ్చే నెల 3 వ తేది నుండి 12 వ తేది వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు,అలంకరణలు, కుంకుమ పూజలు, అభిషేకాలు హోమాలతో పాటుగా అఖండ దీపారాధన, అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులు ఉత్సవాలలో పాల్గొని దుర్గాదేవి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.అలాగే విగ్రహ దాతలు బలిరెడ్డి అప్పారావు కుమారుడు బలిరెడ్డిబాలరాజు & శ్రీదేవి దంపతులు,ఇస్తున్నట్టు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ ప్రజలు దుర్గ యూత్ కుర్రవాళ్ళు,భవానీలు మహిళలు,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS